హైదరాబాద్ : సింఘు సరిహద్దులో దళిత యువకుడి హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ముందుగా నిందితుడు నిహాంగ్ సిక్కు సభ్యుడు సరబ్జీత్ సింగ్ లొంగిపోయిన సంగతి తెలిసిందే. అలాగే మరో నిందితుడు నారాయణ్ సింగ్ను పంజాబ్లోని అమర్ కోట్లో అరెస్ట్ చేశారు. గోవింద్ సింగ్, భగవంత్సింగ్ అనే మరో ఇద్దరిని సైతం అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన నిందితుడు సరబ్జీత్ సింగ్ను పోలీసులు సోనిపట్ కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి న్యాయమూర్తి ఏడు రోజుల పోలీస్ కస్టడీ విధించారు.మరో వైపు పంజాబ్లోని తార్న్తరన్ జిల్లాలోని చీమ ఖుర్ద్ గ్రామంలో హతుడు లఖ్బీర్ అంత్యక్రియలను జరిగాయి.
Mon Jan 19, 2015 06:51 pm