హైదరాబాద్: డబల్ బెడ్ రూం ఇళ్ల కేటాయింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారించింది. నిర్మాణం పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించడం లేదని పిటిషనర్ పేర్కొన్నారు. అలాగే పూర్తయిన నిర్మాణాలు దెబ్బతిని ప్రజాధనం వృథా అవుతోందని పిటిషనర్ పేర్కొన్నారు. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm