హైదరాబాద్ : రికార్డు స్థాయులకు చేరుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్న నష్టాల బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈరోజు కూడా మార్కెట్లు అదే బాటలో పయనించాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 456 పాయింట్లు నష్టపోయి 61,259కి పడిపోయింది. నిఫ్టీ 152 పాయింట్లు కోల్పోయి 18,266కి దిగజారింది. ఈరోజు టెలికాం సూచీ మినహా ఇతర సూచీలన్నీ నష్టాల్లో ముగిశాయి.
Mon Jan 19, 2015 06:51 pm