హైదరాబాద్ : ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెద్దశంకరంపేట మండలం మాడ్చట్పల్లి గ్రామ శివారులో బుధవారం చోటు చేసుకుంది. మాడ్చట్పల్లి గ్రామానికి చెందిన వంకిడి సంగమేశ్ (35) కూలీపని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈనెల 18న భార్య గంగమణితో డబ్బుల విషయంలో గొడవపడి ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా వెళ్లిపోయాడన్నారు. బుధవారం ఉదయం గ్రామ శివారులో ఉన్న శాతం నర్సమ్మ పొలంలో వేపచెట్టుకు ఉరివేసుకొని చనిపోయాడు. మృతుడికి భార్య గంగమణి కుమారుడు, కూతరు ఉన్నారు. మృతుడి తమ్ముడు లింగమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. శవాన్ని పోస్టుమార్డం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ దవాఖానాకు తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm