హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గం సమావేశంకానుంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్లో క్యాబినెట్ భేటీ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు, యాసంగి పంటల సాగుపై క్యాబినెట్లో చర్చించనున్నారు. కరోనా పరిస్థితులు సహా ఇతర అంశాలపై చర్చించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm