కామారెడ్డి: జిల్లాలో విషాదం నెలకొంది. ఓ రోగి హార్ట్ స్ట్రోక్తో డాక్టరు వద్దకు వచ్చాడు. పేషేంట్కు చికిత్స చేస్తుండగా డాక్టర్కు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. దీంతో డాక్టర్, రోగి.. ఇద్దరు మృతి చెందారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం, గుజ్జల్ తండాకు చెందిన వ్యక్తికి గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు రోగిని గాంధారిలోని నర్సింగ్ హోమ్కు తీసుకువచ్చారు. పేషేంటుకు ట్రీట్మెంట్ చేస్తుండగా డాక్టర్ లక్ష్మణ్కు కూడా గుండె పోటు రావడంతో మృతి చెందారు. పేషేంట్ను కామారెడ్డికి తరలిస్తుండగా మార్గమద్యంలో మృతి చెందాడు.
Mon Jan 19, 2015 06:51 pm