హైదరాబాద్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్పై ప్రపంచవ్యాప్తం ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ నియంత్రణ, విదేశీ ప్రయాణికుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో వైద్యాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొత్త వేరియంట్ ఉన్న దేశాల నుంచి రాకపోకలపై చర్చిస్తున్నారు. అంతర్జాతీయ ప్రయాణికుల ట్రేసింగ్, టెస్టింగ్ అంశంపై చర్చిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm