హైదరాబాద్ : గుండెపోటుకు గురైన ఓ రోగికి చికిత్స చేస్తుండగా అదే సమయంలో వైద్యుడికీ గుండెపోటు రావడంతో అతను మృతి చెందాడు. అనంతరం ఆ రోగి కూడా మృతి చెందాడు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుజ్జల్ తండాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధారి మండలం గుజ్జల్ తండాకు చెందిన ఓ వ్యక్తికి ఛాతీలో నొప్పి రావడంతో అతడి కుటుంబసభ్యులు ఆయనను ఎస్వీ రాజా మల్లి స్పెషలిస్ట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యుడు లక్ష్మణ్.. ఆ రోగికి చికిత్స అందిస్తున్నారు. ఆ సమయంలో డాక్టర్ అస్వస్థతకు గురయ్యారు. చికిత్స అందిస్తుండగానే వైద్యుడు లక్ష్యణ్ ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం రోగిని కామారెడ్డిక ఆస్పత్రికి తరలిస్తుండగా అతను సైతం మరణించాడు. వైద్యుడు, రోగి ఇద్దరూ గుండెపోటుతో మరణించడంతో జిల్లాలో విషాదం నెలకొంది.
Mon Jan 19, 2015 06:51 pm