హైదరాబాద్ : మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్కు మళ్లీ పాకిస్థాన్ నుంచి బెదిరింపులు వచ్చాయి. 'ఢిల్లీ సెంట్రల్ పోలీస్ కమిషనర్ స్వేతా చౌహాన్ కూడా నిన్ను రక్షించలేరు, కశ్మీర్పై రాజకీయాలు చేయోద్దు` అని శనివారం ఆయనకు ఈ మెయిల్లో వచ్చింది. దాంతో గంభీర్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా ఆయనకు బెదిరింపు రావడం ఇది మూడో సారి నవంబరు 23న గంభీర్కు మొదటిసారి బెదిరింపు మెయిల్ వచ్చింది. అలాగే మరుసటిరోజే మరో బెదిరింపు వచ్చింది. అందులో 6 సెకన్ల నిడివితో గంభీర్ ఇంటిని వీడియో తీసి పంపించారు. 'నవంబరు 23నే గంభీర్ చంపాలనుకున్నానని, కానీ బతికిపోయాడు` అని మెయిల్ వచ్చింది. దాంతో అప్రమత్తమైన పోలీసులు గంభీర్ నివాసం వద్ద కట్టుదిట్టంగా భద్రతను ఏర్పాటుచేశారు.ఈ మెయిల్స్ పాకిస్థాన్, కరాచీ నుంచి వచ్చినట్లు పోలీసులు నిర్ధరించారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm