అమరావతి : కొమరిన్, శ్రీలంక తీరంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీలోని నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నేడు, రేపు .. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సముద్రం అలజడిగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. తాజా హెచ్చరికలతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలకు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm