న్యూఢిల్లీ : ఈ నెల 29 నుండి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం అఖిల పక్ష పార్టీల సమావేశం నిర్వహించారు. కాగా ఈ సమావేశానికి ప్రధాని మోడీ గైర్హాజరయ్యారు. కేంద్రం తరపున రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ హాజరయ్యారు.
ఈ సమావేశానికి మోడీ వస్తారని, ఏదైనా విషయం పంచుకుంటారని భావించామని రాజ్యసభ ఎంపి, కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. ఇటీవల రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలు మరో రూపంలో తీసుకు వస్తారన్న భయాందోళనల మధ్య వీటి గురించి మరింత అడగాలని భావించినట్టు చెప్పారు. అలాగే రైతు ఉద్యమంలో చనిపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, పెట్రోల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇక కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయాలన్న రైతుల డిమాండ్పై తనను రాజ్నాథ్ సింగ్ మాట్లాడనివ్వడం లేదని ఆప్ నేత సంజయ్ సింగ్ ఆరోపిస్తూ సమావేశం మధ్యలో నుంచి వెళ్లిపోయారు. ఈ సమావేశంలో కేంద్రం తరుపు హాజరైన మంత్రులు ఎవ్వరినీ మాట్లాడనివ్వడం లేదని, ఎంఎస్పి గ్యారెంటీ చట్టంతో పాటు బిఎస్ఎఫ్ అధికార పరిధి పెంపు అంశాలను లేవనెత్తగా ... సమావేశంలో మాట్లాడనివ్వడం లేదంటూ సంజయ్ అన్నారు. పెగాసస్, ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలపై చర్చించాలని ప్రతిపక్షాల్లో అధిక భాగం కోరాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Nov,2021 03:55PM