అమరావతి : దేశవ్యాప్తంగా టమాటా ధరలు పెరిగిపోవడంతో ఇప్పుడు అవి హాట్ టాపిక్ అయిపోయాయి. ఎక్కడయినా దొంగతనం జరిగిందంటే.. బంగారం, వెండి, ఆభరణాలు, డబ్బు అనుకుంటాం.. కానీ ఇప్పుడు దొంగల చూపు టమాటాపైనే ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో టమాటా దొంగతనం చేసేంత ఖరీదయిన వస్తువైపోయిందని అర్థమవుతోంది. ఓ చోట ఏకంగా టమోటాలతో ఉన్న మూడు ట్రేలను దొంగలు ఎత్తుకుపోయారు !
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు సత్రం సెంటర్లో ఓ కూరగాయల దుకాణంలో శుక్రవారం రాత్రి దొంగలు టమాటాలను చోరీ చేశారు. దుకాణంలో అనేక రకాల కూరగాయలు ఉన్నప్పటికీ కేవలం 3 టమాటా ట్రేలను మాత్రమే దొంగలు ఎత్తుకుపోయారు. శనివారం ఉదయాన్నే దుకాణం తెరిచిన వ్యాపారి పెనుగొండ సూరి.. టమాటాలు చోరీకి గురైన విషయాన్ని గుర్తించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒక్కో ట్రేకు రూ.2 వేలు వెచ్చించి ఖమ్మం నుంచి దిగుమతి చేసుకున్నామని సూరి తెలిపారు. నెల రోజులు కష్టపడి కూరగాయలు అమ్ముకున్నా ఆ డబ్బులు రావని ఆవేదన చెందాడు. జగ్గయ్యపేట మార్కెట్ లో కేజీ టమాటా రూ.70 - రూ.100ల వరకు పలుకుతుండటమే దీనికి కారణమని స్థానికులు భావిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Nov,2021 04:12PM