కాన్పూర్ : భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో నాలుగో రోజు ఆట ముగిసింది. భారత జట్టు కాసేపటి క్రితమే రెండో ఇన్నింగ్స్ లో 234 పరుగుల స్కోరు వద్ద భారత జట్టు డిక్లేర్ చేసి 284 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ జట్టు ముందుంచింది. అయితే రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 4 పరుగులు చేసింది. దాంతో ఇంకా న్యూజిలాండ్ జట్టు గెలవాలంటే ఇంకా 280 పరుగులు చివరి రోజు చేయాల్సి ఉంది. భారత్ గెలవాలంటే ఐదో రోజు ఆటలో 9 వికెట్లు తీయాల్సి ఉంది. దాంతో మొదటి టెస్టు ఆసక్తికరంగా మారింది.
Mon Jan 19, 2015 06:51 pm