హైదరాబాద్: రేపటి నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఆదివారం ప్రగతిభవన్లో సమావేశమైంది. ఈ మేరకు టీఆర్ఎస్ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్లో తెలంగాణ సమస్యలను గట్టిగా ప్రస్తావించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతవరకైనా పోవాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తాలన్నారు. కనీస మద్ధతు ధర చట్టం, విద్యుత్ చట్టాల రద్దు కోసం పోరాడాలని సూచించారు. కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా కోసం పట్టుబట్టాలని చెప్పారు. తెలంగాణకు కేంద్రం ప్రత్యేకంగా చేసిందేమీ లేదని కావున కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన అంశాలపై ప్రశ్నించాలన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm