హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించడంతో మెదక్లో ఓ చర్చ మొదలైందని ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. సిద్దిపేటలో జరిగిన ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీఆర్ఎస్పై ఆ పార్టీ కార్యకర్తలే వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్ధిని పెట్టడంతో హరీశ్ రావు టీఆర్ఎస్ నాయకుల చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు.టీఆర్ఎస్ పై వ్యతిరేకంగా ఉన్న ఓట్లు అన్ని కాంగ్రెస్కే పడతాయన్నార. బీజేపీ మీద వాళ్లకు నమ్మకం లేదని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ప్రజాప్రతినిధులు వారి ఓటును ఎవరికి వెయ్యాలి అని సతమతమయ్యారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే టీఆర్ఎస్ కు షాక్ తగిలినట్టే అని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm