పాట్నా : బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్పై ఆర్జేడీకి చెందిన ఎమ్మెల్యే రాజ్వంశీ మహతో సంచలన ఆరోపణలు చేశారు. నితీశ్కుమార్ గంజాయి తాగేవారంటూ ఆరోపించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. సీఎం నితీశ్కుమార్ గంజాయి తాగుతారన్నారు. బీహార్లో మద్యపాన నిషేధం కేవలం కంటితుడుపు చర్య మాత్రమేనన్నారు. రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో, నగరంలో అది అందుబాటులో ఉందన్నారు. నితీశ్కుమార్ కేవలం ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. మద్యాన్ని నిషేధిస్తే నితీశ్కుమార్ ఇతరులను ఎందుకు ప్రమాణం చేయమని బలవంతం చేస్తున్నారని ప్రశ్నించారు. దానిని తనపై ఎందుకు అమలు చేయడం లేదని అన్నారు.
అసలైన మాఫియాపై రాష్ట్ర పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని, పేదలపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో గంజాయి అమ్మకాలు, వినియోగం కూడా నిషేధించబడిందని.. మరి నితిశ్ కుమార్ గంజాయి వ్యసనాన్ని ఎందుకు విడిచిపెట్టడం లేదని ప్రశ్నించారు. కాగా ఇటీవలే ముఖ్యమంత్రి నితిశ్ కుమార్.. మంత్రులతో, అధికారులతో తాము మద్యం తాగబోమని ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఎమ్మెల్యే రాజ్వంశీ మహతో వ్యాఖ్యలు చేయడం చర్చనియాంశమయ్యాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Nov,2021 06:05PM