కరీంనగర్ : కరీంనగర్ జిల్లా శంకరపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కాచాపూర్లో ఓ వృద్ధుడు ఆదివారం దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాచాపూర్ గ్రామానికి చెందిన మాతంగి కనకయ్య (70)కు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉండేవారు. కుమారుడు చనిపోవడంతో కనకయ్య తన కోడలు కొమురమ్మ, ఆమె అక్క కొడుకు ప్రవీణ్ తో కలిసి ఉంటున్నాడు. కనకయ్య కూతురు లక్ష్మి కూడా ఇదే గ్రామంలో ఉంటోంది. కాగా, ప్రతీ రోజు ఉదయం కనకయ్య తన కూతురు ఇంటికి వెళ్లి టీ తాగేవాడు. అయితే ఆదివారం ఉదయం కనకయ్య తన గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కూతురు వెళ్లి చూసింది. అక్కడ మంచంపై వృద్ధుడు విగత జీవిగా పడి ఉన్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుడి శరీరంపై గాయాలు ఉండటంతో హత్యకు గురైనట్టు పోలీసులు, కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm