హైదరాబాద్ : శ్రీశైలం ఆలయం వద్ద భక్తులకు పెను ప్రమాదం తప్పింది. ఓ లారీ బ్రేకులు ఫెయిలై క్యూలైన్లలో ఉన్న భక్తుల మీదకు దూసుకొచ్చింది. గమనించిన దేవస్థానం సిబ్బంది, సెక్యురిటీ అప్రమత్తై బండరాళ్లు అడ్డుపెట్టి లారీని ఆపడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
పూర్తి వివరాల్లోకెళ్తే.. విజయ పాల డైరీకి చెందిన లారీ.. ఆలయ దక్షిణ మాడ వీధి నుంచి ఉచిత దర్శనం క్యూలైన్ మీదకు బ్రేకులు ఫెయిలై దూసుకొచ్చింది. దాంతో భక్తులు ఒక్కసారిగా కేకలు వేయడంతో దేవస్థానం సిబ్బంది, సెక్యురిటీ అప్రమత్తమయ్యారు. లారీకి బండరాళ్లు అడ్డుపెట్టి ఆపారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీని పక్కకు తరలించారు. సిబ్బందిని, సెక్యూరిటీ గార్డులను దేవస్థానం ఈవో లవన్న అభినందించారు. ఆలయంలో తయారు చేసే లడ్డు పదార్థానికి కావాల్సిన నెయ్యి క్యాన్లను లారీ తీసుకొచ్చినట్టు తెలిసింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Nov,2021 08:11PM