హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ కలిసి తెలంగాణలో చదువుకోకుండా చేస్తున్నారని బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. గురుకులాలకు బడ్జెట్ ఇవ్వలేదని.. తనను ఎన్నో కష్టాలు పెట్టారని.. భిక్షంలా వేశారని అన్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. .పాలకులు బలహీన వర్గాలకు విద్యను అందనివ్వడం లేదన్నారు. ముస్సోలిని నుంచి మోడీ, కేసీఆర్ వరకూ అంతా కరుడుగట్టిన నియంతలని మండిపడ్డారు. బలహీన వర్గాలకు జరుగుతున్న తరతరాల అన్యాయం గురించి తెలియాలంటే చదవి అధ్యయనం చేయాలన్నారు. కేసీఆర్ ఒక్క యూనివర్సిటీకైనా వెళ్లారా, కనీసం విద్యాశాఖపై ఒక్క సమీక్ష అయినా నిర్వహించారా అని ప్రశ్నించారు. తెలంగాణలో మెడకాయ మీద తలకాయ ఉన్న సీఎం అయితే.. విద్యకు ప్రాముఖ్యతనివ్వాలని అన్నారు.
బహుజనులను ఎదగకుండా చేయాలని పాలకులు భావిస్తున్నారని అన్నారు. ఎంబీసీ కార్పొరేషన్కు నాలుగు సంవత్సరాల పాటు 2,744 కోట్లు కేటాయిస్తే.. 7 కోట్లు విడుదల చేశారన్నారు. ఓటుకు 6 వేలు, దళిత బంధుకు రూ.10 లక్షలు అంటూ డబ్బు మత్తులో కొట్టుకుపోతే బహుజన రాజ్యం రాదని.. అందరిలో చైతన్యం రావాలన్నారు. బహుజన రాజ్యం వస్తేనే బలహీన వర్గాల స్థితిగతులు మారతాయని అందుకు ఈ రోజు నుంచే పనిచేయాలని పిలుపునిచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Nov,2021 08:21PM