హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ ధర్నాచౌక్లో ఆదివారం కాంగ్రెస్ రెండో రోజు వరి దీక్షలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని అన్నారు. అసమర్థ కేసీఆర్ను ఉరి తీసినా తప్పులేదని అన్నారు. కేసీఆర్ సంపాదన నిజాం కంటే ఎక్కువ ఉందని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు.తనకు పదవులు ముఖ్యం కాదని.. కాంగ్రెస్లో తాము అందరం పీసీసీ ప్రెసిడెంట్లమేనని చెప్పారు. న్న చిన్న మనస్పర్థలు వచ్చినా అందరం కలిసి పనిచేస్తామని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm