శబరిమల వెళ్లే భక్తులకు వరంగల్ 1 డిపో నుండి ఆర్టీసీ స్పెషల్ బస్సులు ఇవ్వబడును. వివరాలకు డిపోమేనేజర్ ని సంప్రదించగలరు. #choosetsrtc #shabarimala #rtchirebuses @tsrtcmdoffice @TSRTCHQ pic.twitter.com/dQusTBiyde
— Depot Manager WL1 (@dmwgl1) November 16, 2021
హైదరాబాద్ : శబరిమలకు వెళ్లే భక్తుల కోసం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. అంతే కాకుండా ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది. అదేంటంటే శబరిమలకి వెళ్లే భక్తులు ఆర్టీసీ బస్సును బుక్ చేసుకుంటే అదే బస్సులో మరో ఐదుగురికి ఉచిత ప్రయాణం కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు వరంగల్ 1 డిపో తరఫున ట్విట్టర్లో ప్రకటించారు. శబరిమలకు బస్సు బుక్ చేసుకున్న అయ్యప్ప భక్తులతో పాటు ఇద్దరు వంట మనుషులు, ఒక అటెండర్, పదేండ్లలోపు ఇద్దరు మణికంఠ స్వాములకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మొత్తంగా మూడు ఫుల్ టిక్కెట్లు, రెండు హాఫ్ టిక్కెట్లకు ఎటువంటి రుసుము వసూలు చేయడంలేదని తెలుస్తోంది. అయితే వారికి ప్రత్యేకంగా సీట్లు కేటాయించబోమని.. బస్సులో ఖాళీగా ఉన్న స్థలంలో వారు కూర్చోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే చార్జీలను ఆర్టీసీ ట్విట్టర్ లో ప్రకటించింది.