హైదరాబాద్ : ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలపై జియో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీపెయిడ్ ప్లాన్ల చార్జీలను పెంచుతున్నట్టు జియో ప్రకటించింది. ఒక్కో ప్లాన్ ధరను 19.6 నుంచి 21.3శాతం వరకు పెంచుతున్నట్టు తెలిపింది. ఈ ధరలు డిసెంబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.
ప్రస్తుతం పెంచిన టారిఫ్ లతో రూ.75 ఉన్న జియోఫోన్ ప్లాన్ రూ.91కి పెరగనుంది. అలాగే అన్లిమిటెడ్ ప్లాన్ రూ.129.. రూ.155కు, రూ.399 ప్లాన్ రూ. 479కు చేరనుంది. ఇక రూ.555 ప్రీపెయిడ్ ప్లాన్ కాస్త.. రూ.666కి చేరనుంది. రూ.599 ప్లాన్ ఏకంగా 719కి పెరగనుంది. రూ. 1,299 ప్లాన్ కూడా రూ. 1,559కు అలాగే రూ. 2,399 ప్లాన్.. 2,879కు చేరనుంది.
ఇక డేటా టాప్ అప్ ల విషయానికొస్తే.. 6 జీబీ డేటా ప్లాన్ రూ. 51 నుంచి రూ. 61కు, 12 జీబీ డేటా ప్లాన్ రూ. 101 నుంచి రూ. 121కు, 50 జీబీ డేటా ప్లాన్ రూ. 251 నుంచి రూ. 301కు చేరనున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 28 Nov,2021 09:18PM