న్యూఢిల్లీ : హర్యానాలోని దారుణం చోటుచేసుకుంది. స్పా సెంటర్ లో పనిచేసే ఇద్దరు యువతులపై పోలీసులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ నెల 25 న ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 25న కానిస్టేబుల్ అనిల్, హోంగార్డు జితేంద్రలు స్థానికంగా ఉన్న స్పా మసాజ్ సెంటర్పై దాడిచేశారు. ఆ తర్వాత అక్కడ పనిచేస్తున్న ఇద్దరు యువతులను బలవంతంగా లాక్కొచ్చి వారి వాహనంలో ఎక్కించి లైంగికంగా వేధించారు. ఆ తర్వాత యువతులను మరో వాహనంలోకి మార్చారు. అనంతరం వారిని ఒక హోటల్కు తరలించారు. అక్కడ ఇద్దరు పోలీసులు వారి మిత్రుడు ధర్మేంద్రతో కలిసి యువతులపై సాముహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం విషయాన్ని బాధితులు ..స్పాసెంటర్ నిర్వాహకులు తెలపగా వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం బయటపడింది. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వారిని కోర్టులో హాజరు పరిచి జ్యూడిషియల్ కస్టడీకి పంపినట్టు డీఎస్పీ మహమ్మద్ జమల్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm