హైదరాబాద్ : విజయవాడ-హైదరాబాద్ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి వద్ద లారీ బోల్తా పడింది. డివైడర్ను ఢీకొని రహదారి మధ్యలో లారీ పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్- విజయవాడ మార్గంలో 4కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. ఫలితంగా ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్ పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించారు.
Mon Jan 19, 2015 06:51 pm