హైదరాబాద్ : సింగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ఇంద్రేశంలోని జ్యోతిబాఫూలే గురుకుల విద్యాలయంలో కరోనా కలకలం సృష్టించింది. 300 మంది విద్యార్థులకు కొవిడ్ పరీక్షలు చేయగా.. ఇందులో 27 మందికి పాజిటివ్గా తేలినట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో విద్యార్థులందరినీ ఐసోలేషన్లో ఉంచారు. పాఠశాలలో మొత్తం 900 మంది విద్యార్థులు ఉన్నారు. మిగతా విద్యార్థులందరికీ శుక్రవారం కొవిడ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యాధికారి గాయత్రిదేవి తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm