హైదరాబాద్ : కార్తీకమాసం ముగియనున్న నేపథ్యంలో గురువారం శ్రీశైల క్షేత్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గురువారం తెల్లవారుజామున పుష్కరిణి, కృష్ణానదిలో స్నానాలు చేసి స్వామి, అమ్మవార్ల దర్శనాల కోసం బార్లు తీరారు. దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే సామూహిక అభిషేకాలు, కుంకుమార్చనలతోపాటు వివిధ ఆర్జిత సేవల్లో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మల్లన్న గర్భాలయ దర్శనాలకు అనుమతించడంతో విడతలవారీగా వీఐపీ బ్రేక్ దర్శనాల టిక్కెట్ల కోసం యాత్రికులు పోటీ పడ్డారు. అదే విధంగా ఉచిత, శీఘ్ర దర్శన టిక్కెట్లు తీసుకున్నవారికి సుమారు మూడు గంటలకుపైగా దర్శనానికి సమయం పట్టింది.
Mon Jan 19, 2015 06:51 pm