అమరావతి: ఏపీలోని కడప జిల్లాలోని ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. గ్యాస్ కట్టర్ సాయంతో ఏటీఎంలోని రూ.17లక్షల నగదును దుండగులు అపహరించారు. ఈ ఘటన కడప శివారు కేఎస్ఆర్ఎమ్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి దాటిన తర్వాత ఐదుగురు వ్యక్తులు ఏటీఎంలోకి ప్రవేశించారు. ముందుగా ఏటీఎంలోని సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టి.. అనంతరం గ్యాస్ కట్టర్ సాయంతో ఏటీఎం మిషన్ను కట్ చేసి దొంగతనానికి పాల్పడ్డారు. ఏటీఎం చోరీని ఈరోజు ఉదయం గుర్తించిన బ్యాంకు సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ వెంకట శివారెడ్డి సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీమ్తో పరిసర ప్రాంతాల్లో ఆధారాలు సేకరించారు. బ్యాంకు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm