హైదరాబాద్ : 179 చలాన్ లున్న ఓ బైక్ను పోలీసులు పట్టుకోగా ఆ బైక్ను నడుపుతున్న వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని అంబర్ పేటలో చోటుచేసుకుంది. కాచిగూడ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం అలీకేఫ్ చౌరస్తాలో ఎస్సై విజయ్ వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అయితే ఓ బైక్ ను ఆపగా దానిపై 179 కేసులు పెండింగ్లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. రూ.42,475 జరిమానా చెల్లించాలని నిర్థారణయ్యింది. దాంతో సదరు వాహనదారుడు బైక్ను అక్కడే వదిలేసి పారిపోయాడు. మెదక్ జిల్లాకు చెందిన రత్నయ్య పేరిట వాహనం ఉందని తెలిసింది.
Mon Jan 19, 2015 06:51 pm