హైదరాబాద్ : తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 50 వేల పరిహారాన్ని ఇవ్వాలని ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయించారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం మంగళవారం జారీ చేసింది. ఈ సహాయాన్ని రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి నుంచి అందించనున్నారు. అయితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్, కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్తంగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కరోనాతో మృతి చెందినట్టు నిర్ధారణయిన కుటుంబాలకే ఈ పరిహారం వర్తించనుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం తమిళనాడులో ఇప్పటి వరకు 2,800 మంది కరోనాతో మృతి చెందారు.
Mon Jan 19, 2015 06:51 pm