హైదరాబాద్ : ప్రజల కోసం బాధ్యతతో పనిచేసే నాయకులకే మద్దతుగా నిలవాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్లో 18 అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవితలు కలిసి శంకుస్థాపన చేశారు. దాదాపు రూ. 30 కోట్లతో భీమ్గల్ పట్టణంలో ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు ప్రారంభించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. కేవలం రాజకీయాల కోసం మాట్లాడే వారికి కాకుండా ప్రజల కోసం బాధ్యతతో పనిచేసే నాయకులకే మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం మరొకరిని చేయమనటం సరికాదని అన్నారు. కొందరు బీజేపీ నాయకులు కేవలం రాజకీయాల కొసం బట్టేబాజ్ మాటలు చెప్తున్నారని అన్నారు. వారి మాటలతో అభివృద్ధి జరగదని చెప్పారు. తెలంగాణ దేశంలోనే అగ్రరాష్ట్రంగా నిలిచిందని, దీనికి సీఎం కేసీఆర్ కృషి, పట్టుదలే కారణమని చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm