హైదరాబాద్ : హైదరాబాద్ లోని రాంనగర్ డివిజన్ రిసాలగడ్డలో వాటర్ ట్యాంక్ లో మృతదేహం బయటపడింది. పూర్తి వివరాల్లోకెళ్తే.. సంతోష్ నగర్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల కారణంగా ప్రస్తుతం వాటర్ పైప్లైన్ మరమ్మతులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో వాటర్ వర్క్స్ సిబ్బంది.. వాటర్ ట్యాంక్ను శుభ్రం చేస్తున్నారు. ఈ క్రమంలో మృతదేహం బయటపడింది. దాంతో సిబ్బంది.. ముషీరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm