హైదరాబాద్ : పాఠశాలల మూసివేతపై వస్తున్న ప్రచారాలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. పాఠశాలలు మూసివేస్తారని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను నమ్మొద్దన్నారు. ఇప్పటికే విద్యార్థులు రెండేండ్లు నష్టపోవడం జరిగిందని.. వారి భవిష్యత్పై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్, ఒమిక్రాన్ వేరియంట్పై రంగారెడ్డి జిల్లా జడ్పీ కార్యాలయంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి సమీక్షించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యా సంస్థల్లో కొవిడ్ వ్యాప్తిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని తెలిపారు. పాఠశాలల్లో పకడ్బందీగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఈ విషయంలో ఎలాంటి పుకార్లు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. పాఠశాలల్లో అక్కడక్కడా స్పల్పంగా కేసులు నమోదవుతున్నాయని అన్నారు. పాఠశాలల్లో కొవిడ్ నియమాలు పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు.
పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తప్పకుండా రెండు డోసులు తీసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో కొవిడ్ ప్రమాణాలు పాటించేలా చూడాలన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. పాఠశాలల్లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తామని.. ఏదైనా ఉంటే ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుంది అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 07 Dec,2021 06:00PM