హైదరాబాద్: అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారుల పట్టుకున్నారు. కువైట్ నుంచి హైదరాబాద్ వస్తున్న గుర్ర నరేందర్ అనే ప్రయాణికుని వద్ద 233.20 గ్రాముల బంగారం అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ 11.49లక్షలు ఉంటుందని తెలిసింది. అధికారులు విచారణ జరుపుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm