హైదరాబాద్ : ఏపీలో గడచిన 24 గంటల్లో 30,747మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా పరీక్షించగా 184 మందికి పాజిటివ్ గా నిర్ధారణయింది. అలాగే కరోనాతో ఇద్దరు మృతి చెందగా 204 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఆ రాష్ర్టంలో 2,008 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు రాష్ర్ట వైద్యారోగ్యశాఖ తెలిపింది.
ఏపీలో ఇప్పటివరకు 20,74,036 కరోనా కేసులు నమోదు కాగా 20,57,573 మంది కోలుకున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,455కి పెరిగింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 07 Dec,2021 06:14PM