హైదరాబాద్ : దక్షిణాది రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు తగ్గాయి. గీరాకీ తగ్గిపోవడంతో తయారీ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. 50 కిలోల బస్తాపై రూ.20-40 వరకు తగ్గించినట్టు ఈ మేరకు డీలర్లు తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో బస్తాకు రూ.40 వరకు, తమిళనాడులో రూ.20 దాకా కోతలు పడ్డాయి. కేరళ, కర్ణాటకల్లోనూ రూ.20-40 వరకు కోత విధించారు. ఈ ధరల తగ్గింపు నేపథ్యంలో 50 కిలోల బస్తా తెలుగు రాష్ట్రాల్లో రూ.280-320కి పరిమితం కానుంది. తమిళనాడులో ఒక టాప్ బ్రాండ్ సిమెంట్ ధర రూ.400 దిగువకు, కర్ణాటక, కేరళల్లోనూ బస్తాధర రూ.360-400 నుంచి 340-380కి చేరినట్టు డీలర్లు వివరించారు.
కోత విధించిన కంపెనీల్లో అల్ట్రాటెక్ సిమెంట్, ఇండియా సిమెంట్స్, ఓరియంట్ సిమెంట్స్, సాగర్ సిమెంట్స్, అంబుజా సిమెంట్స్, రామ్కో సిమెంట్స్, చెట్టినాడ్ సిమింట్, ఎన్సిఎల్ ఇండిస్టీస్ , థాల్మియా భారత్, శ్రీ సిమెంట్, హెడల్బర్గ్ సిమెంట్ ఇండియా తదితరాలున్నాయి.
దక్షిణాది రాష్ట్రాల్లో అకాల వర్షాలకు తోడు ద్రవ్యలభ్యత సమస్యతో గిరాకీ మరింతగా తగ్గిందని డీలర్లు చెబతున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో నవంబర్ చివరి వారం నుంచి డిసెంబర్ తొలి వారం వకు భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లో అమ్ముడుపోని ఇండ్లు అధిక స్థాయిలో ఉండటంతో కొత్త ప్రాజెక్టులపై ప్రభావం పడుతోంది. బిల్లర్ల వద్ద డబ్బులు లేక సిమెంట్ వినియోగం సైతం తగ్గింది. జనవరి మధ్యలో కానీ, ఫిబ్రవరి ప్రారంభంలో కాని దక్షిణాదిన గిరాకీ పుంజుకునే అవకాశం ఉందని సిమెంట్ కంపెనీలు భావిస్తున్నాయని డీలర్లు చెబుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 07 Dec,2021 06:35PM