హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులు జీతాలు పెంచుతూ మునిసిపల్ శాఖ ఇటీవల జీవో జారీ చేసింది. దాంతో చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తో పాటు మున్సిపల్ శాఖ స్పెషల్ సెక్రటరీ అరవింద్ కుమార్లపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అరవింద్ కుమార్, మున్సిపల్ శాఖ అదనపు కార్యదర్శి సుదర్శన్ కుమార్లను హెచ్చరించాలని సీఎస్కు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ జీవోను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వెనక్కి తీసుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm