హైదరాబాద్ : ఢిల్లీలో ఓ తెలంగాణ యువకుడు నిరసన చేపట్టాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి ఉపరితల గని వలన వ్యవసాయ భూములు కోల్పోయిన తమకు సింగరేణి సంస్థ నష్టపరిహారం చెల్లించడం లేదని సంజయ్ అనే యువకుడు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశాడు. న్యాయం చేయాలని కోరుతూ ప్రధానిని కలిసేందుకు అతను ఆరు రోజులు బైక్ పై ప్రయాణించి ఢిల్లీ చేరుకున్నాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..భూములు కోల్పోయిన తమకు సింగరేణి సంస్థ నష్టపరిహారం చెల్లించడం లేదని, ప్రజాప్రతినిధులు అధికారులను ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా న్యాయం జరగడం లేదని వాపోయాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ప్రధానిని కలిసి తమ సమస్య పరిష్కరించాలని కోరతానని.. న్యాయం చేయకపోయినా పర్వాలేదు.. చావడానికైనా అనుమతి ఇవ్వండి` అంటూ వీడియో సోషల్ మీడియాలో పెట్టాడు.
సంజయ్ కుటుంబం 5 సంవత్సరాలుగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఎందరికీ విన్నవించినా తమకు న్యాయం జరగడం లేదని వాపోతున్నారు. ఇటీవల సంజయ్ తండ్రి సుందర్ ఇల్లందులో సెల్ టవర్ సైతం ఎక్కాడు. అయితే అతని సమస్యను పరిష్కరిస్తామని చెప్పి అధికారులు అతన్ని టవర్ దింపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 07 Dec,2021 07:24PM