హైదరాబాద్ : ఆస్కార్ అవార్డుల బరిలో తొలి సారిగా ఓ తెలుగు సినిమా నిలిచింది. అది కూడా యూట్యూబ్ లో విడుదలైన ఒక షార్ట్ ఫిల్మ్ కావడం విశేషం. ఆ సినిమానే 'మనసానమః`. విరాజ్ అశ్విన్ హీరోగా, ధృషిక చందర్, శ్రీవల్లి రాఘవేందర్, పృథ్వీ శర్మ లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు దీపక్ రెడ్డి రూపొందించారు. గజ్జల శిల్ప నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కింది.
మనసానమః షార్ట్ సినిమా గతేడాదే యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. ఈ మూవీకి ఇప్పటికే 900కు పైగా అంతర్జాతీయ, రీజనల్ అవార్డులు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా ఆస్కార్ నామినేషన్స్ లో కూడా నిలిచింది. ఆస్కార్ అవార్డు కోసం క్వాలిఫైలో ఉన్న మనసానమః చిత్రానికి ఈ నెల 10 నుంచి ఓటింగ్ జరగబోతుంది.
ఇక మనసానమః సినిమాలో ఉన్న విశేషమేంటంటే ఇది రివర్స్ స్క్రీన్ ప్లేలో సాగుతుంది. 20 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం ఆస్కార్ అవార్డు కోసం ఈ నెల 10 నుంచి ఓటింగ్ జరగబోతుంది.కావున ఓటింగ్ లో విన్ అవ్వాలని ఆశిద్దాం.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 07 Dec,2021 07:40PM