హైదరాబాద్ : నిరసనలు ఆపితేనే రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటామన్న కేంద్రం ప్రతిపాదనను సంయుక్త కిసాన్ మోర్చా తిరస్కరించింది. అలాగే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంపై కమిటీని ఏర్పాటు చేస్తామన్న కేంద్ర ప్రతిపాదనకు కూడా వారు అంగీకరించలేదు . కేంద్రం మంగళవారం పంపిన ప్రతిపాదనలో తమకు పలు అభ్యంతరాలు ఉన్నాయని తెలిపింది. అదే విషయాన్ని మరో లేఖ ద్వారా కేంద్రానికి తెలిపామని సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. ఇక నిరసనలు కొనసాగించే విషయమై బుధవారం జరిగే సమావేశంలో నిర్ణయిస్తామని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm