అమరావతి : విద్యుదాఘాతంతో ఏనుగు మృత్యువాత పడిన ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలోని వేపనపల్లి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వేపనపల్లి గ్రామచెరువు సమీపంలో సుబ్రహ్మణ్యం అనే రైతు పొలంలోని వ్యవసాయ మోటరుకు అమర్చిన విద్యుత్ వైర్లు తగిలి ఏనుగు మరణించింది. పంచనామా అనంతరం గోయ్యి తవ్వి ఏనుగుకు ఖననం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm