హైదరాబాద్ : పెంచిన డిగ్రీ, పీజీ ఫీజులను తగ్గించాలని డిమాంగ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఓయూ పరిపాలన భవనం ముందు విద్యార్థులు ధర్నాకు దిగగా పోలీసులను భారీగా మోహరించారు. అయితే వందల సంఖ్యలో ఉన్న విద్యార్థులు పోలీసులను, సెక్యూరిటీ సిబ్బందిని నెట్టుకుని పరిపాలన భవనంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దాంతో తోపులాట జరిగి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలో కొందరు పరిపాలన భవనం అద్దాలు ధ్వంసం చేశారు.
మరో వైపు విద్యార్థులు మాట్లాడుతూ.. ఉస్మానియా, కాకతీయ, జేఎన్ టీయూ, హైదరాబాద్ సహా మహాత్మ గాంధీ యూనివర్సిటీలలో ఇంజనీరింగ్, ఫార్మసీ, పీజీ కోర్సు ఫీజులు భారీ మొత్తంలో పెంచుతూ నిర్ణయం తీసుకోవడం అన్యాయమన్నారు. ఉస్మానియాలో కోర్సుల ఫీజులు భారీగా పెంచారన్నారు. పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 07 Dec,2021 09:24PM