హైదరాబాద్ : కరోనా బారిన పడకుండా వ్యాక్సిన్లు అందరూ వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని రాష్ర్టాల్లో మాత్రం వ్యాక్సిన్లు వృథా అవుతున్నాయి. ముఖ్యంగా ఐదు రాష్ట్రాలు కరోనా వ్యాక్సిన్లు ఉపయోగించుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి.
కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ డేటా ప్రకారం..కరోనా వ్యాక్సిన్లు ఉపయోగించుకోని రాష్ర్టాలలో మొదటి స్థానం యోగి నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ యే. ఆ తర్వాత మహారాష్ట్ర, బెంగాల్, బిహార్, రాజస్థాన్ రాష్ట్రాలున్నాయి. యూపీలో అత్యధికంగా 2.9 కోట్ల వ్యాక్సిన్లు అలాగే ఉండిపోగా, బెంగాల్ లో 2.5 కోట్లు, మహారాష్ట్రలో 2.2 కోట్లు, బిహార్లో 1.80 కోట్లు, రాజస్థాన్లో 1.4 కోట్లు, తమిళనాడులో 1.35 కోట్లు, మధ్యప్రదేశ్లో 1.1 కోట్ల వ్యాక్సిన్లు అలాగే ఉండిపోయాయి.
మొదటి డోసును కూడా తీసుకోని ప్రజలు సైతం ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నారని ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి. యూపీలో 3.50 కోట్ల మంది ఇంకా మొదటి డోసునే తీసుకోలేదు. ఇక బిహార్లో 1.89 కోట్ల మంది, మహారాష్ట్రలో 1.71కోట్లు, తమిళనాడులో 1.24 కోట్ల మంది ఇంకా మొదటి డోసును తీసుకోలేదని గణాంకాల్లో తేలింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 07 Dec,2021 09:51PM