హైదరాబాద్ : ప్రముఖ సినీ గేయ రచయిత 'సిరివెన్నెల్ణ సీతారామశాస్త్రి` ఇటీవలే మృతి చెందిన సంగతి తెలిసిందే. వారి మృతికి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఈ మేరకు వారి కుటుంబానికి ప్రధాని నరేంద్ర మోడీ ఓ లేఖ రాశారు. అందులో 'పద్మావతి గారు.. సిరివెన్నెల సీతారామశాస్ర్తి మృతి బాధాకరం. మీ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను. బహుముఖ కవి, శాస్త్రి తన స్వరకల్పనల ద్వారా ఆ కాలంలోని సామాజిక వాస్తవాలను ప్రతిబింబించేలా విస్తృతంగా ప్రసిద్ది చెందారు. తెలుగును ఫేమస్ చేయడం కోసం ఆయన కృషి చేశారు. సిరివెన్నెల తెలుగు భాషపై పట్టు కలిగిన వ్యక్తే కాదు.. పదం పట్ల భావాన్ని కలిగి ఉన్న వ్యక్తి కూడా. సాహిత్యానికి ఆయన చేసిన విశిష్ట సహకారానికి పద్మశ్రీ, అలాగే ఇతర అవార్డులను ఆయన పొందారు. తెలుగు సాహిత్యానికి ఆయన లేని లోటు పెద్దది. సిరివెన్నెల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను్` అంటూ పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm