హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా తీవ్రంగా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 55,883 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 2,043 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,057కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 22,048 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 1,174 కరోనా కేసులు నమోదైనట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
Mon Jan 19, 2015 06:51 pm