హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా ఉధృతి రోజురోజుకు తీవ్రమవుతోంది. కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన హోం ఐసొలేషన్లో ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా సోకింది. దీంతో ఆయన హోం ఐసొలేషన్లో ఉన్నారు. ఇటీవల తనతో సన్నిహితంగా ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కరోనా మొదటి వేవ్లో ముత్తిరెడ్డి కరోనా బారినపడ్డారు. అప్పట్లో రాష్ట్రంలో కరోనా సోకిన తొలి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కావడం గమనార్హం.
Mon Jan 19, 2015 06:51 pm