- ఒకరు మృతి, ఇద్దరి పరిస్దితి విషమం
- మానవ మృగాన్ని చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు
- పండగ పూట కొండాపురంలో విషాదం
నవతెలంగాణ- వెంకటాపురం
కుటంబ కలహలు పండగపూట విషాదంగా మారాయి. మానవ మృగంగా మారిన భర్త భార్య, అమ్మమ్మ, అత్తను గోడ్డలితో విచక్షణా రహితంగా నరికాడు, అమ్మమ్మ మృతి చెందగా, భార్య, అత్త ప్రాణా పాయ స్దితిలో ఉన్నా సంఘటన ఆదివారం రాత్రి ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని కోండాపురంలో చొటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కధనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. కొండాపురం గ్రామానికి చెందిన చంటికి భార్య, కుటుంబసభ్యుల మధ్య గత కొంతకాలంగా కలహలు ఉన్నాయి. అత్త సమ్మక్క వెంకటాపురంలోని బీసీ వసతి గృహంలో స్వీపర్గా విధులు నిర్వహిస్తుంది. పండగ కావడంతో స్వగ్రామమైన కొండాపురం వేళ్లారు. కుటుంబ కలహల నేపధ్యంలో చంటి ఆదివారం 8 గంటల సమయంలో గొడ్డలితో అమ్మమ్మ ఆదిలక్ష్మి, భార్య లోకేశ్వరి, అత్త సమ్మక్కలపై దాడి చేశాడు. అమ్మమ్మ ఆదిలక్ష్మి ఇంటి వద్దె రక్తపు మడుగులో పడి మృతి చెందగా. భార్య లోకేశ్వరి , అత్తమ్మ సమ్మక్కలకు తీవ్రగాయాలు అయ్యాయి. వారిని వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. భార్య లోకేశ్వరి కోమాలో ఉండగా, అత్త సమ్మక్కల పరిస్దితి విషమంగా ఉంది. ప్రధమ చికిత్స అందించిన వైద్యులు మేరుగైన వైద్యం కోసం ఏటూరు నాగారం తరలించారు. విచక్షణా రహితంగా గోడ్డలితో ముగ్గురిపై దాడి చేసిన మానవ మృగాన్ని కొండాపురం గ్రామస్తులు తాళ్లతో బందించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 16 Jan,2022 10:12PM