హైదరాబాద్ : తెలంగాణ-చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. బీజపూర్ సమీపంలోని కర్రెలగుట్ట అటవీప్రాంతంలో జరిగిన కాల్పుల్లో నలుగురు నక్సల్స్ మృతి చెందారు. మరణించిన మావోయిస్టుల్లో ఎటూరు నాగారం-మహదేవ్ పూర్ ఏరియా కమిటీ కార్యదర్శి సుధాకర్ కూడా ఉన్నట్టు భావిస్తున్నారు. కాగా, ఈ కాల్పుల ఘటనలో ఒక గ్రేహౌండ్స్ జవాన్ కు తీవ్రగాయాలు కావడంతో అతడిని వరంగల్ తరలించారు. ఘటన స్థలం పరిసరాల్లో ప్రస్తుతం గాలింపు జరుగుతోంది.ఈ మేరకు బస్తర్ రేంజి ఐజీ పి.సుందర్ రాజ్ వివరాలు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm