హైదరాబాద్ : ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొనడంతో ఓ డెలివరీ బాయ్ మృతి చెందిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రవికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా, పునాదిపాడు మండలం కంకిపాడు గ్రామానికి చెందిన రావూరి దుర్గప్రసాద్(37) మియాపూర్లోని ప్రజయ్ సిటీలోని బ్లాక్ నంబర్.5లో నివసిస్తూ అమెజాన్లో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య శ్రావణి, మూడేండ్ల పాప ఉన్నారు. ఈ నెల 16న రాత్రి విధులు ముగించుకుని కూకట్పల్లి నుంచి మియాపూర్ వైపు బైక్పై అతను ఇంటికి వెళుతుండగా బైక్ అదుపుతప్పి మెట్రో పిల్లర్ నంబర్.631 వద్ద డివైడర్ను ఢీకొట్టింది. దాంతో అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm