హైదరాబాద్ : ఇటీవలే భారత టెస్టు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పి అందరికీ షాకిచ్చాడు విరాట్ కోహ్లి. అయితే కెప్టేన్సీని వదులుకునేముందు బీసీసీఐ ఇచ్చిన ఆపర్ కు కోహ్లి నో చెప్పాడని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించే ముందు ఓ బీసీసీఐ అధికారి.. ఇప్పటికే 99 టెస్టు మ్యాచులు పూర్తి చేసిన కోహ్లీని 100వ టెస్ట్ మ్యాచ్(బెంగళూరు) తర్వాత కెప్టెన్సీ వదులుకోవాలని చెప్పాడట. అప్పుడు బీసీసీఐ కోహ్లీని ఘనంగా సన్మానించాలనుకుంటున్నట్టు తెలిపాడు. కానీ బీసీసీఐ ఆఫర్ను కోహ్లీ తిరస్కరించాడని తెలుస్తోంది. ఒక్క మ్యాచ్తో పెద్ద మార్పులేమీ రావని, అసలు తాను రికార్డులను, సెంటిమెంట్లను పట్టించుకోనని కోహ్లీ సమాధానమిచ్చినట్టు సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm