హైదరాబాద్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ సమయంలో బ్లాక్ ఫంగస్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగుచూశాయి. అయితే దేశంలో ప్రస్తుతం మళ్లీ బ్లాక్ ఫంగస్ కలకలం రేగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తొలి బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్లోని కాంట్ కు చెందిన 45 ఏండ్ల ఓ వ్యక్తి బ్లాక్ ఫంగస్తో లక్షణాలతో సోమవారం ఆస్పత్రిలో చేరాడు. అతనికి కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ కాగా అతడి ఒక కన్ను, ముక్కుకు బ్లాక్ ఫంగస్ వ్యాపించింది. కరోనా థర్డ్ వేవ్ లో ఇదే తొలి కేసు అని అధికార వర్గాలు తెలిపాయి. అతనికి మధుమేహం ఉందని జీఎస్వీఎం మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంజయ్ కాలా చెప్పారు. షుగర్ కారణంగా ఆ వ్యక్తికి బ్లాక్ ఫంగస్ సోకినట్లు భావిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm